యాప్నగరం

బైక్ షోరూమ్‌ను మేనేజర్‌ని చంపి రూ.22లక్షల దోపిడీ

బ్యాంక్ నుంచి రూ.22లక్షల డ్రా చేసి వెళ్తున్న బైక్ షోరూమ్ మేనేజర్‌ని దుండగులు చంపి నగదు దోచుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని తేనిలో జరిగింది.

Samayam Telugu 21 Jun 2020, 10:14 am
ఓ షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపేసిన దుండగులు అతడి నుంచి ఏకంగా రూ.22లక్షలు దోచుకున్న ఘటన తమిళనాడులో జరిగింది. తేనిలోని బంగ్లామేడు పెన్నిక్విక్‌ నగర్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ (34) బైక్ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం షోరూం ఖాతా నుంచి నగదు డ్రా చేయడానికి పెత్తాట్చి వినాయక ఆలయం సమీపాన ఉన్న ఓ బ్యాంకుకు వెళ్లాడు. రూ.22 లక్షలు డ్రా చేసి షోరూమ్‌కు వచ్చిన తర్వాత అతడు మళ్లీ బయటకు వెళ్లి తిరిగిరాలేదు. డబ్బును కూడా షోరూం పద్దుల్లో జమ చేయలేదు.
Samayam Telugu Image


Also Read: ఆడబిడ్డను చంపేసిన అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ.. తూ.గో. జిల్లాలో దారుణం

దీంతో షోరూమ్ యాజమాన్యం తేని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అరుణ్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మలైకరట్టు కొండ దిగువభాగంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వరదరాజన్‌ సిబ్బందితో అక్కడకు వెళ్లగా అరుణ్‌కుమార్‌ హత్యకు గురై కనిపించారు. మృతదేహం పక్కన రక్తపు మరకలు ఉన్న సుత్తి, సెల్‌ఫోన్‌, కొంత దూరంలో ఆయన బైక్ కనిపించాయి. శరీరంపై వెనుకవైపు, ముఖంపై సుత్తితో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో నగదు డ్రా చేసినట్లు తెలుసుకున్న దుండగులు అతడిని వెంబడించి హత్య చేసి, నగదు తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో వృద్ధురాలి దారుణహత్య.. నగలతో ఉడాయించిన పనిమనిషి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.