యాప్నగరం

Bus Dragged Bike: బైక్​ను ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి.. భయానక వీడియో

Bus Dragged Bike ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా.. ఓ ఆర్టీసీ బస్సు బైక్‌ను డీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ, బస్సు డ్రైవర్ కనీసం మానవత్వం లేని మనిషిలా ప్రవర్తించాడు. బస్సు ఆపలేదు సరికదా ఏకంగా బైక్‌ను ఈడ్చుకెళ్లాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 కి.మీ. మేర బైక్‌ను తీసుకెళ్లడంతో చూసిన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 21 May 2023, 3:55 pm

ప్రధానాంశాలు:

  • ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన యూపీ ఆర్టీసీ బస్సు
  • ఎటావా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తోన్న బస్సు
  • ప్రమాదం తర్వాత వాహనం ఆపకుండా ప్రయాణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu UP Accident
నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. బైక్‌కు ఢీకొట్టి.. 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ మాత్రం బస్సు బానెట్లో ఇరుక్కుపోయినా డ్రైవర్ పట్టించుకోలేదు. అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చి దాదాపు 12 కిలో మీటర్ల మేర లాక్కెళ్లాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటావా జిల్లా కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన మే 19 అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 19 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఫజల్‌గంజ్ డిపోకు చెందిన బస్సు.. ఎటా నుంచి ఢిల్లీకి వెళ్తోంది. కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవుల కొట్టం ప్రాంతంలో వికాస్ (25) అనే బైకర్ను ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వికాస్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, బస్సు బానెట్ మధ్యలో బైక్ ఇరుక్కుపోయింది. దీనిని పట్టించుకొని బస్సు డ్రైవర్.. వాహనాన్ని అలాగే ముందుకు పోనిచ్చాడు.


ఏకంగా 12 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లిపోయాడు. దీనిన గమనించిన కొందరు వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బస్సును నిలిపివేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని ఎవరో తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి.. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఘటనకు బాధ్యుడైన బస్సు డ్రైవర్ అజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వికాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

Read More Latest Crime News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.