యాప్నగరం

అర్ధరాత్రి అరటి తోటలో క్షుద్రపూజలు.. పెళ్లి కోసమేనా!

అమలాపురంలో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం రేగింది. బండారులంక గ్రామంలోని ఓ అరటితోటలో అర్ధరాత్రి క్షుద్రపూజలు నిర్వహిస్తున్న కొందరిని గ్రామస్థులు అడ్డుకొని దాడికి దిగారు.

Samayam Telugu 13 Jun 2019, 7:11 pm
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం రేగింది. బండారులంక గ్రామంలోని ఓ అరటితోటలో అర్ధరాత్రి క్షుద్రపూజలు నిర్వహిస్తున్న కొందరిని గ్రామస్థులు అడ్డుకొని దాడికి దిగారు. ఎవరికి ఏ హాని తలపెట్టడానికి అలా చేస్తున్నారని నిలదీశారు. క్షుద్రపూజలు చేస్తున్న పూజారిని మందలించారు. పూజా సామగ్రిని చిందరవందర చేశారు.
Samayam Telugu pooja
క్షుద్రపూజలు


గ్రామస్థులు ఎక్కడ దాడి చేస్తారోనని బాధితులు వణికిపోయారు. పెళ్లి కాలేదని.. దోష నివారణ కోసం పూజలు చేస్తున్నామని చెప్పారు. అయితే.. వారి మాటలను నమ్మని గ్రామస్థులు వారిపై విరుచుకుపడ్డారు.

క్షుద్రపూజల నిర్వహిస్తున్న ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.