యాప్నగరం

ఆర్డీవో కార్యాలయం వద్ద ‘పెట్రోల్‌’ కలకలం.. నలుగురు ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Samayam Telugu 16 Dec 2019, 5:44 pm
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. తమ పంట పొలానికి వెళ్లే దారిని కొందరు కబ్జా చేసి గేటు పెట్టారని వారు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాటిళ్లతో వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకుని నిప్పుపెట్టుకునేందుకు ప్రయత్నించారు.
Samayam Telugu petrol


Also Read: పాకిస్తాన్ ప్రేమికులు.. భారత ప్రియురాళ్లు!

దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే స్పందించిన ఆర్డీవో గోపిరామ్.. తహసీల్దార్‌ను పిలించారు. వీరికి పొలానికి వెళ్లే దారిని చూపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు కాస్త శాంతించారు.

Also Read: 8వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.