యాప్నగరం

ఏపీలో దారుణం.. మరదలిని గొడ్డలితో నరికిన బావ

ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఆస్తివివాదం నడుస్తోంది.ఈ క్రమంలో శ్రీలేఖతో బావ చిన్న ఏసన్న గొడవకు దిగాడు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై దాడికి దిగాడు.

Samayam Telugu 6 Jun 2020, 12:25 pm
లాక్ డౌన్‌తో కొన్నాళ్లు పాటు ఎలాంటి నేరాలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు సడలింపులు చేయడంతో నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత తమ్ముడి భార్యను మరదలని కూడా చూడకుండా గొడ్డలితో నరికి హతమార్చాడు. నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిన్న ఏసన్న, పుష్పరాజు అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఇదే విషయమై తమ్ముడి భార్య శ్రీలేఖ, చిన్న ఏసన్న శుక్రవారం గొడవ పడ్డాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న గొడ్డలి తీసుకొని మరదలి మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో శ్రీలేఖ అక్కడికక్కడ కుప్పకూలింది. రక్తపు మడుగులో పడివున్న బాధితురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే శ్రీలేఖ మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయశేఖర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.