యాప్నగరం

పెళ్లయిన మరుసటి రోజే ప్రియుడితో వధువు పరార్.. షాక్‌లో వరుడు

పెళ్లయిన మరుసటి రోజూ వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. అతడిని పెళ్లి చేసుకుని రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Samayam Telugu 8 Jun 2020, 10:26 am
పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. సేలం జిల్లా చిన్నమసముద్రానికి చెందిన పూమారై కూతురు సత్య(20)కు సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్‌(28)తో ఈ నెల నాలుగో తేదీన వివాహం జరిగింది. రవికుమార్ వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదో తేదీన సాయంత్రం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన సత్య తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో సత్య తల్లిదండ్రులు సెంగవల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Samayam Telugu Image


Also Read: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్మ.. ఖమ్మంలో విషాద ఘటన

అదే సమయంలో చిన్నసముద్రానికి చెందిన వల్లరసు(23) అనే యువకుడిని సత్య పెళ్లి చేసుకుని రక్షణ కల్పించాలంటూ ఆత్తూర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్‌, బంధువులు, సత్య తల్లిదండ్రులు వెంటనే ఆత్తూర్ పీఎస్‌కు చేరుకున్నారు. తాను, వల్లరసు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకుండా రవికుమార్‌తో బలవంతంగా పెళ్లి చేసినందునే ఇంటి నుంచి పారిపోయినట్లు సత్య పోలీసులకు చెప్పింది. వరుడు కుటుంబం తనకు పెట్టిన బంగారు ఆభరణాలను పోలీసుల సమక్షంలోనే తిరిగిచ్చేసింది. అయితే పెళ్లికి అయిన ఖర్చును తిరిగిచ్చేయాలని రవికుమార్‌ కోరడంతో సత్య, వల్లరసు అంగీకరించారు. దీనికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లోనే స్టాంప్ పేపర్లపై సంతకాలు చేసి వెళ్లిపోయారు.

Also Read: నవవధువు అనుమానాస్పద మృతి.. రాత్రి తల్లికి ఫోన్.. తెల్లాసేసరికే శవమై

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.