యాప్నగరం

తల్లి మాజీ భర్తని కొట్టి చంపిన కొడుకులు.. దారుణం

తల్లి మాజీ భర్త దగ్గరికెళ్లింది. అక్కడ ఉండడం అవమానంగా భావించిన కొడుకులు తమతో రావాలిన అడిగి చూశారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో దారుణానికి పాల్పడ్డారు.

Samayam Telugu 4 Jul 2020, 8:23 pm
వివాహం జరిగిన రెండేళ్లకే భర్త నుంచి విడిపోయిన భార్య రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరు కొడుకులు పుట్టాక ఇటీవల భర్త మరణించాడు. దీంతో నెమ్మదిగా మాజీ భర్తకి చేరువైన తల్లి అతనితో వెళ్లిపోయింది. కొడుకులతో ఉండేందుకు ససేమిరా అనడంతో అవమానంగా భావించిన కొడుకులు సవతి తండ్రిని కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


జిల్లాలోని తల్వార్ ఏరియాకి చెందిన మహిళకి 35 ఏళ్ల కిందట గుర్మైల్ సింగ్‌(55)తో వివాహమైంది. పెళ్లైన రెండేళ్లకే విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అనంతరం గుర్మైల్ సింగ్ ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆమె మరో వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు జస్‌ప్రీత్ సింగ్(23), జస్‌దీప్‌ సింగ్(25) పుట్టారు. ఐదేళ్ల కిందట ఆమె రెండో భర్త మరణించాడు.

Also Read: కూతురి న్యూడ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. అడ్డంగా బుక్కైన కీచకులు

రెండేళ్లుగా తల్లి తన మాజీ భర్తతో మాట్లాడడం ప్రారంభించింది. ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయి అతనితోనే ఉంటోంది. అది నచ్చని కొడుకులు అక్కడికి వెళ్లి తల్లితో గొడవపడ్డారు. ఆమె వారితో రానని తెగేసి చెప్పడంతో కోపంతో సవతి తండ్రి గుర్మైల్ సింగ్‌పై దాడి చేశారు. అతన్ని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గుర్మైల్ తన సోదరి ధరమ్‌జీత్ కౌర్‌కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: ఫేస్‌బుక్‌‌ మాయలో టీచరమ్మ.. రూ.38 లక్షలకు టోకరా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.