యాప్నగరం

హెచ్‌ఓడీతో రాసలీలల వీడియో లీక్.. హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

పెరియార్ యూనివర్శిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న నివేద ఆదివారం హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 13 Jan 2020, 10:24 am
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సేలం జిల్లాలోని ఓమలూరులోని పెరియార్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టికి చెందిన తిరుమలై కుమార్తె నివేద బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఆదివారం కాలేజీ హాస్టల్‌ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు వార్డెన్‌కు సమాచార ఇచ్చారు. దీంతో ఆయన కరుప్పూర్‌ పోలీసులకు ఫోన్ చేశారు.
Samayam Telugu TAMILNADU


Also Read: జూనియర్ ఆర్టిస్ట్ కళ్యాణి ఆత్మహత్య.. భర్తే చంపాడంటున్న తల్లిదండ్రులు

సమాచారం అందుకున్న సూర మంగళం ఇన్‌స్పెక్టర్, సేలం డిప్యూటీ కమిషనర్‌ తంగదురై, అసిస్టెంట్‌ కమిషనర్‌ సెల్వరాజ్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. నివేద మృత దేహం వద్ద మూడు పేజీల సూసైడ్‌ నోట్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. నివేది రాసిన సూసైడ్‌ నోటిలోని అంశాల ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ‘26 మందితో సెక్స్ చేశా... నీకూ నా మగతనం చూపిస్తా’.. మహిళా ఎస్‌ఐకి లైంగిక వేధింపులు

మరోవైపు నివేద చదువుతున్న విభాగంలోని హెచ్‌ఓడీ ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది నివేదనా? లేక వేరొకరా? అని పరిశీలిస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సూరమంగళం పోలీసులు తెలిపారు.

Also Read: జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ భగ్నం.. అర్ధనగ్నంగా డ్యాన్సులు.. 21 మంది యువతుల అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.