యాప్నగరం

ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ.. మహిళ నిద్రిస్తూ కనిపించడంతో..

చోరీ చేసేందుకు ఇంటికెళ్లిన దొంగ నిద్రిస్తున్న మహిళపై కన్నేశాడు. ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో అలికిడికి ఆమె లేచి చూసి పెద్దగా కేకలు వేసింది.

Samayam Telugu 13 May 2020, 9:45 pm
ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగ నిద్రిస్తున్న మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణె పరిధిలోని చకాన్‌ ప్రాంతంలోని ఓ జంట నివాసం ఉంటున్న ఇంట్లోకి తెల్లవారుజాము సమయంలో దొంగ చొరబడ్డాడు. కిటికీ నుంచి లోపలికి ప్రవేశించిన దొంగ సుమారు రూ.15 వేల విలువైన సెల్‌ఫోన్‌తో పాటు రూ.5 వేల నగదు చోరీ చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అంతటితో ఆగని దొంగ కన్ను నిద్రిస్తున్న మహిళ(28)పై పడింది. నిద్రలో ఉన్న మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమెకు మెలకువ వచ్చి లేచి చూసి పెద్దగా కేకలు వేసింది. భార్య కేకలు విన్న భర్త నిద్రలేచి దొంగని పట్టుకునే ప్రయత్నం చేశాడు. భార్యాభర్తలిద్దరినీ నెట్టేసి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఊహించని ఘటనతో మహిళ షాక్‌కి గురైంది.

Also Read:
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కిన తల్లి.. మంచానికి కట్టేసి దారుణం

మరుసటిరోజు ఉదయం భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. రూ.20 ఇరవై వేల విలువైన సొత్తు దొంగిలించడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదు చేశారు. దొంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకుని బాధితురాలు వాపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం.. కన్నవారే ఛీ కొట్టడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.