యాప్నగరం

కరోనా పేషెంట్ల ఇళ్లలో లూటీ.. కిటికీలు పగలగొట్టి దొంగల బీభత్సం

కరోనా మహమ్మారి పేరు వింటేనే బెంబేలెత్తిపోతుంటే.. ఏకంగా కోవిడ్ సోకిన వాళ్ల ఇళ్లలోనే దోపిడీకి పాల్పడిన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఇళ్లలో ఎవరూ లేరని తెలిసే దొంగతనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 30 Mar 2020, 11:31 pm
కరోనా వైరస్ సోకిందని తెలిస్తేనే ఆమడదూరం పారిపోతుంటే ఆ దొంగలకు మాత్రం భయం కలిగినట్టు లేదు. ఏకంగా కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఇళ్లనే టార్గెట్ చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, అతను కలిసిన వ్యక్తులను కూడా క్వారంటైన్‌కి పంపించడం కూడా వారికి బాగా కలిసొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని పక్కాగా తెలియడంతో తాపీగా వచ్చి సైలెంట్‌గా పని పూర్తి చేసుకెళ్లారు.
Samayam Telugu loot


మరుసటి రోజు ఇంటి బయట పడి ఉన్న సూట్‌కేసులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కరోనాకు కూడా భయపడకుండా ఇంటిని లూటీ చేసిన ఆశ్చర్యకర ఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లా హజిన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని శ్రీనగర్‌లోని స్కిమ్స్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Also Read: కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్.. సైబర్ కేటుగాళ్ల ఖతర్నాక్ దోపిడీ

కరోనా పాజిటివ్‌ వ్యక్తుల కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్‌కు తరలించడంతో ఆ రెండు ఇళ్లలో ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన దొంగలు కిటికీలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాల సహా విలువైన వస్తువులను దొంగిలించినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం ఇంటి బయట సూట్‌కేసులు, కొన్ని వస్తువులు చిందరవందగా పడవేసి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: లాక్‌డౌన్: ఇంట్లోకి రానీయలేదని యువకుడి ఆత్మహత్య.. సిద్ధిపేటలో విషాద ఘటన

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగలను గుర్తించేందుకు ఫోరెన్సిక్, మెడికల్ టీమ్‌లను రప్పించారు. అయితే ఇది ఇంటి దొంగల పని అయి ఉంటుందని.. లేదా తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరూ ఇళ్లలో లేరనే విషయం తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.

Also Read: పేరెంట్స్‌ని చూసొస్తానన్న భార్య.. మద్యం తాగించి మరీ చంపేసిన భర్త.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.