యాప్నగరం

కరోనా ఎఫెక్ట్‌తో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. మూసేసిన కాలేజీని ఊడ్చేశారు..

కరోనా ఎఫెక్ట్‌తో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. మూసివేసి ఉన్న సంస్థలను టార్గెట్ చేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. చివరికి కంప్యూటర్లను కూడా వదలకుండా దోచేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

Samayam Telugu 24 Mar 2020, 10:02 pm
దేశం ఓ వైపు కరోనా వైరస్ విజృంభణతో అల్లాడుతుంటే దోపిడీ దొంగలు మాత్రం కాసులు కొల్లగొడుతున్నారు. రోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలే టార్గెట్‌గా రెచ్చిపోయారు. ఓ కాలేజీలో చొరబడి ఏకంగా పది లక్షల విలువైన కంప్యూటర్ పరికరాలను దోచుకెళ్లిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. గతవారంలో ఓ స్కూల్లో పడి పిల్లలను వసూలు చేసిన ఫీజుల మొత్తం రూ.78 వేలను దోపిడీ చేసిన ఘటన చోటుచేసకుంది.
Samayam Telugu robbery3


నగరంలోని హెబ్బగొడి ప్రాంతంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ కళాశాలలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వేళ కాలేజీలో చొరబడి సుమారు పది లక్షల రూపాయల విలువైన కంప్యూటర్ పరికరాలను చోరీ చేశారు. ఉదయాన్నే కళాశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి యాజమన్యానికి తెలియజేయడంతో పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: ‘యువతి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో..’ డబ్బుల కోసం ఆన్‌లైన్ ఫ్రెండ్ అరాచకం

కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్న 56 ప్రాసెసర్లు, ర్యామ్‌లు, అలాగే మ్యాథమేటిక్స్ ల్యాబ్‌లోని 30 ప్రాసెసర్లు ర్యామ్‌లను అపహరించినట్లు ప్రిన్సిపాల్ రాయ్ ఫాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెబ్బగొడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత వారం ఇదే తరహా దోపిడీ ఘటన చోటుచేసుకుంది. కొననకుంటె ఏరియాలోని లయోలా హైస్కూల్‌లో దోపిడీ జరిగింది.

విద్యార్థుల నుంచి అప్లికేషన్ ఫీజు కింద వసూలు చేసిన రూ.78 వేలు చోరీకి గురయ్యాయి. పాఠశాల గది వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగదు దోపిడీ చేసినట్లు స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగదుతో పాటు సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ బ్యాగ్, మొబైల్ చార్జర్లను సైతం తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also:
కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేసిన తండ్రి.. విచారణలో షాకింగ్ నిజాలు.. మేనకోడలిని నట్టింట్లోనే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.