క్వారంటైన్లో 13 రోజులు.. చివరి రోజు అనూహ్యంగా సూసైడ్.. కారణమదేనా?
వినోద్ భాయ్కి కరోనా నెగెటివ్ అని వైద్యులు చెప్పారు. అయితే క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వైద్యులు చెప్పినట్లుగానే క్వారంటైన్లో ఉన్న ఆయన.. చివరి రోజు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.
Samayam Telugu 4 Apr 2020, 6:22 pm
కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ బిజినెస్ మ్యాన్ డాక్టర్లను సంప్రదించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అతనికి కరోనా నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించడంతో ఇంట్లోనే ఓ గదిని క్వారంటైన్ సెంటర్గా మార్చుకుని 13 రోజులు ఉన్నాడు. కానీ చివరి రోజు ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఊహించని విధంగా వ్యాపార వేత్త ఉరేసుకుని చనిపోయాడు.
గుజరాత్లోని గాంధీనగర్కి చెందిన బిజినెస్ మ్యాన్ వినోద్ భాయ్ పురుషోత్తంభాయ్ చౌరాసియా(42) దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకి కరోనా సోకలేదని.. రిపోర్టు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాడు.
Also Read: ట్రక్కుని ఢీకొట్టిన కారు.. ఇద్దరు డ్రైవర్లు సహా ఐదుగురి దుర్మరణం
రెండు వారాల క్వారంటైన్లో 13 రోజులు పూర్తి చేసిన వినోదాబాయ్ చివరి రోజు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కి గల కారణాలు తెలియరాలేదు. వినోద్భాయ్కి భార్య మనీషా(40), త్రిశాల(10), నిహారిక(5), రెండున్నరేళ్ల కొడుకు ఆర్యన్ ఉన్నాడు. వినోద్భాయ్ మొర్బి జిల్లాలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుండగా కుటుంబం పలాన్పూర్లో నివాసం ఉండేది.
లాక్డౌన్ కారణంగా గత నెల 20న వినోద్భాయ్ ఇంటికి వచ్చేశాడు. క్వారంటైన్లో ఉంటూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కుటుంబంలో కలహాలు ఉన్నాయని.. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా భయంతో చనిపోయాడా? లేక కుటుంబ కలహాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: మద్యం దొరక్క కూల్డ్రింక్లో షేవింగ్ లోషన్.. ఇద్దరు యువకులు మృతి.. తీవ్ర విషాదం
గుజరాత్లోని గాంధీనగర్కి చెందిన బిజినెస్ మ్యాన్ వినోద్ భాయ్ పురుషోత్తంభాయ్ చౌరాసియా(42) దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకి కరోనా సోకలేదని.. రిపోర్టు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాడు.
Also Read: ట్రక్కుని ఢీకొట్టిన కారు.. ఇద్దరు డ్రైవర్లు సహా ఐదుగురి దుర్మరణం
రెండు వారాల క్వారంటైన్లో 13 రోజులు పూర్తి చేసిన వినోదాబాయ్ చివరి రోజు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కి గల కారణాలు తెలియరాలేదు. వినోద్భాయ్కి భార్య మనీషా(40), త్రిశాల(10), నిహారిక(5), రెండున్నరేళ్ల కొడుకు ఆర్యన్ ఉన్నాడు. వినోద్భాయ్ మొర్బి జిల్లాలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుండగా కుటుంబం పలాన్పూర్లో నివాసం ఉండేది.
లాక్డౌన్ కారణంగా గత నెల 20న వినోద్భాయ్ ఇంటికి వచ్చేశాడు. క్వారంటైన్లో ఉంటూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కుటుంబంలో కలహాలు ఉన్నాయని.. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా భయంతో చనిపోయాడా? లేక కుటుంబ కలహాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: మద్యం దొరక్క కూల్డ్రింక్లో షేవింగ్ లోషన్.. ఇద్దరు యువకులు మృతి.. తీవ్ర విషాదం