యాప్నగరం

ప్రాణం తీసిన జోక్.. వ్యాపారవేత్తని కొట్టి చంపేసిన స్నేహితులు

మాటల మధ్య తమను కించపరిచేలా జోక్ వేశాడన్న కోపంతో ఇద్దరు యువకులు తమ స్నేహితుడైన వ్యాపారవేత్తను దారుణంగా తలపై కొట్టి చంపేశారు.

Samayam Telugu 14 Jul 2020, 12:50 pm
స్నేహితుల మధ్య సరదాలు, జోకులు, ముచ్చట్లు, పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి కొందరు వేసే జోకులు ఎదుటివారిని కించపరిచేలా ఉన్నా మనోడే కదా అని స్నేహితులు లైట్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు అలాంటి జోకులే ప్రాణాలు కూడా తీస్తాయి. నోయిడాకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య సోని ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu Image


Also Read: పెళ్లయిన 13ఏళ్లకు అదనపు కట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

ఈ నెల ఐదో తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఆదిత్య తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం గ్యాంగ్ కాలువలో అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో అతడి స్నేహితులైన పంకజ్, దేవ్ అనే ఇద్దరు వ్యక్తులను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు.

Also Read: ఇంటర్ బాలిక మధులికపై దాడి కేసు.. ప్రేమోన్మాదికి 15ఏళ్ల కారాగారం

ఐదో తేదీన తమను కలవడానికి వచ్చిన ఆదిత్య మాటల మధ్యలో కించపరిచేలా జోక్ వేశాడని, దీంతో తమ మధ్య వాగ్వాదం జరిగిందని నిందితులు తెలిపారు. తామిద్దరం కర్రలతో తలపై కొట్టడంతో చనిపోయాడని చెప్పారు. తర్వాత అతడి సెల్‌ఫోన్, శరీరంపై ఉండే బంగారు ఆభరణాలు తీసుకుని శవాన్ని గ్యాంగ్ కాలువ సమీపంలోని డంపింగ్ యార్డులో పడేసినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పోలీసుల నుంచి తప్పించుకున్న రేపిస్ట్.. లారీ కింద పడి దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.