యాప్నగరం

వ్యాపారవేత్తని కత్తులతో పొడిచిన ప్రత్యర్థులు.. పశ్చిమ గోదావరిలో దారుణం

పశ్చిమ గోదావరి జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. రైస్ మిల్లు వివాదంలో ప్రముఖ వ్యాపార వేత్తపై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థులు కత్తులతో పొడిచి పరారయ్యారు.

Samayam Telugu 24 Sep 2020, 5:08 pm
ప్రముఖ వ్యాపారవేత్తని కత్తులతో పొడిచేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని నిడదవోలుకి చెందిన వ్యాపారవేత్త, 28 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సత్తి వేణుమాధవ్ రెడ్డిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడికి తెగబడ్డారు. మండలంలోని సమిశ్రగూడెంలో ఈ ఘటన జరిగింది. అనంత లక్ష్మీ నరసింహ రా రైస్ మిల్ వ్యవహారంలో కొద్దికాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాధవరెడ్డిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Samayam Telugu దాడికి గురైన మాధవ రెడ్డి
murder attempt


ప్రత్యర్థులు చవ్వ సత్య కృష్ణ, శ్రీధర్ కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేయించినట్లు అనుమానిస్తున్నారు. కత్తులతో నరికి కొనప్రాణంతో ఉన్న మాధవ రెడ్డిని ప్రత్యర్థులే ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక శేషగిరి ఆసుపత్రిలో మాధవ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న చవ్వ శ్రీధర్‌ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సత్య కృష్ణ, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద తుపాకీతో అనుమానితులు.. కడపలో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.