యాప్నగరం

అమరావతిలో కాల్‌మనీ కలకలం.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు

కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగిని కాల్‌మనీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. తాజాగా మరో యువకుడు ఆత్మహత్యకు యత్నించడంతో కాల్‌మనీపై చర్చ జరుగుతోంది.

Samayam Telugu 15 Dec 2019, 3:01 pm
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్‌మనీ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. అమరావతిలోని తాడేపల్లిలో కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తాళలేక వెంకట్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
Samayam Telugu Amaravathi1


Also Read: భార్య వేధింపులు, దుబారా ఖర్చు భరించలేక టెక్కీ ఆత్మహత్మ

కాల్‌మనీ వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఆదివారం తాడేపల్లి పోలీస్‌స్టేసన్‌కు వచ్చిన వెంకట్ పీఎస్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు యత్నించాడు. కొద్దిరోజులుగా వడ్డీ వ్యాపారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన వెంకట‌ను పోలీసులు కాపాడి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also Read: యువతితో ఇద్దరు బిడ్డల తండ్రి ప్రేయాయణం.. నిజం తెలిసి తట్టుకోలేక

ఇటీవల కాలంలో అమరావతి పరిధిలో కాల‌మనీ వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగిని కాల్‌మనీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. వడ్డీతో సహా అసలు మొత్తం తీర్చేసినా వ్యాపారులు తన డెబిట్ కార్డు, చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనకొచ్చే జీతాన్ని వారే తీసుకుంటున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆ ఘటన మరువకముందే అమరావతిలోనే మరో ఘటన జరగడం కలకలం రేపింది.

Also Read: విదేశీ అమ్మాయిలతో ప్రముఖుల రాసలీలలు. గోవాలో మరో సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.