యాప్నగరం

పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. కారు ఢీకొనడంతో పైనుంచి పడి బైకర్ మృతి

శనివారం రాత్రి బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న బైక్‌ను ఫ్లైఓవర్‌పై కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయాడు.

Samayam Telugu 30 Jun 2019, 8:52 am

ప్రధానాంశాలు:

  • పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై రోడ్డుప్రమాదం
  • కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి పైనుంచి పడి మృతి
  • మృతుడు కరీంనగర్‌కు చెందిన వాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu pjimage (4)
హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌ పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. భీతిగొలిపేలా జరిగిన ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్‌లపై ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోసారి గుర్తుచేసింది.
శనివారం రాత్రి బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వస్తున్న బైక్‌ను ఫ్లైఓవర్‌పై కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడి వద్ద లభించిన ఓటర్ కార్డు ఆధారంగా కరీంనగర్‌కు చెందిన తాజుద్దీన్ మహమ్మద్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా.. బైక్‌ రూపరేఖలు లేకుండా తుక్కుగా మారిపోయింది. ఈ ప్రమాదం కారణంగా అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లైఓవర్‌‌పై ట్రాఫిక్ జామైంది. పోలీసులు కారును, బైక్‌ను క్రేన్‌ సాయంతో తొలగించి వాహన రాకపోకలు పునరుద్ధరించారు. కారు అతివేగం ప్రయాణించడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.