యాప్నగరం

విజయవాడలో కారు బీభత్సం.. ఇద్దరి పరిస్థితి విషమం

కనకదుర్గ వారధిపై వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్తున్న మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడి తీవ్రగాయాలయ్యాయి.

Samayam Telugu 30 May 2020, 6:49 pm
విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ని ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా కృష్ణా నది వంతెనపై చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పరిధిలోని తాడేపల్లి వైపు వస్తున్న మోపెడ్‌ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన ధాటికి బైక్‌పై ఉన్న మహిళ సహా మరో వ్యక్తి కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కారుని నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారును వైద్య విద్యార్థిని నడుపుతున్నట్లు సమాచారం. కారుతో ఢీకొట్టిన అనంతరం యువతి వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పోలీసులు స్టేషన్ కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకి దొరికిపోవడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.