యాప్నగరం

మధ్య తరగతి జనంపై మాయ వల.. హైదరాబాద్‌ కేటుగాడి ఘరానా మోసం

హైదరాబాద్‌లో నయా మోసం వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి పీఏగా పరిచయం చేసుకుని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘరానా మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

Samayam Telugu 7 Feb 2020, 5:40 pm
అమాయకులైన పేదలు.. మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా వలేశాడో కేటుగాడు. ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామని చెప్పి అందినకాడికి దోచుకున్నాడు. కేంద్ర మంత్రి పీఏనని చెబుతూ నయా దందాకు తెరతీశాడు. అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసిన ఆ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతని ఆట కట్టించారు.
Samayam Telugu cheating.


డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇప్పిస్తామంటూ నగదు వసూలు చేసిన నయా మోసం నగరంలో వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పీఏనని చెప్పి ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి అమాయకుల వద్ద నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారిని నమ్మించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడు.

Also Read: అమ్మాయిలను గదిలోకి తీసుకెళ్లి.. సెక్స్ వీడియోలు చూపిస్తూ.. స్కూల్ టీచర్ కీచకపర్వం

తీరా చూస్తే.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడంతో డబ్బులు చెల్లించిన వారందరూ తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మోసపోయిన బాధితులందరూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

Read Also: పకోడీలకు డబ్బులడిగినందుకు దారుణం.. రూ.5ల కోసం తుపాకీతో కాల్చేసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.