యాప్నగరం

చిరుత దెబ్బకి తలబొప్పి ఊడి పడి.. మహిళకి తీవ్రగాయాలు

చిరుత పులుల దాడిలో లక్ష్మమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె జుట్టుతో సహా తల పైభాగం ఊడి కిందపడిపోయింది. చిరుత నీళ్ల కోసం మామిడితోటలోకి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

Samayam Telugu 21 Apr 2020, 3:14 pm
లాక్‌డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో ఘాట్ రోడ్లు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. చిరుత పులులు ఇటీవల జనావాసాల్లోకి చొరబడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నీటి కోసం మామిడి తోటలోకి ప్రవేశించిన చిరుత.. భార్యాభర్తలపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ దాడిలో మహిళక తలబొప్పి ఊడి పడిపోయి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటుచేసుకుంది.
Samayam Telugu cheetah-


అటవీ ప్రాంతం నుంచి మామిడితోటలో ప్రవేశించిన చిరుత పులి భార్యాభర్తలపై దాడి చేసిన ఘటన బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలో జరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ దంపతులు బుచ్చయ్యగారిపల్లి సమీపంలో ఉన్న మామిడితోటను కొనుగోలు చేశారు. తోటలోనే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. తెల్లవారుజాము సమయంలో అటవీ ప్రాంతంలోని మామిడితోటలోకి వచ్చిన చిరుత ఒక్కసారిగా దంపతులపై దాడి చేసింది.

Also Read: కూతురి నరబలి.. రెండేళ్ల పాప గొంతుకోసి.. కన్నతండ్రి ఘాతుకం

లక్ష్మమ్మ తలపై చిరుత దాడి చేయడంతో ఆమె తలబొప్పి ఊడిపడింది. జుట్టుతో సహా తల పైభాగం ఊడి కిందపడి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం భార్యాభర్తలు పెద్దగా కేకలు పెడుతూ అదిలించడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుత పులి దాడి విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బాధితురాలిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చిరుత సంచారం నేపథ్యంలో రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. అయితే బుచ్చయ్యగారిపల్లి పరిధిలోని మామిడితోటలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో రాత్రిళ్లు కాపలా ఉండేందుకు భయభ్రాంతులకు గురవతున్నారు.

Read Also: స్నానం చేయడు కానీ సెక్స్ కావాలట.! భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.