యాప్నగరం

ప్రాణం తీసిన అఫైర్.. ప్రియురాలి కొడుకు చేతిలో వ్యక్తి దారుణహత్య

తన తల్లిలో అసభ్యకర రీతిలో కనిపించిన బాషాను ఆమె కొడుకు తీవ్రంగా కొట్టాడు. తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో బాషా అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు.

Samayam Telugu 21 Nov 2019, 12:37 pm
అక్రమ సంబంధం వ్యవహారంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో కొలాథూర్‌లో జరిగింది. చిత్లాపక్కం ప్రాంతానికి చెందిన అన్వర్ బాషా అనే వ్యక్తి మూడేళ్ల క్రితం భార్య పర్వీన్‌తో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడికి వినాయకపురంలోని మహిళతో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. బాషా అప్పుడప్పుడూ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగించేవాడు.
Samayam Telugu pjimage (10)


Also Read: కోరిక తీర్చాలంటూ సేల్స్‌గర్ల్‌కు వేధింపులు.. ఒప్పుకోలేదని బ్లేడ్‌తో

ఈ క్రమంలోనే ఆ మహిళ పెద్ద కొడుక్కి విషయం తెలిసి వారిద్దరిని హెచ్చరించాడు. ఆ యువకుడు బాషాతో పలుమార్లు గొడవపడ్డాడు. 2017లో ప్రియురాలి కొడుకు చెవి కొరికిన కేసులో బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం(నవంబర్ 18) రాత్రి 11 గంటల సమయంలో బాషా తన ఇంటికి వచ్చి తల్లితో ఆ విధంగా ఉండటాన్ని చూసిన ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.

Also Read: అత్తింట్లో అడుగుపెట్టిన కొత్తకోడలికి 4నెలల గర్భం... షాకైన బంధువులు

వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి అక్కడి రప్పించాడు. వారంతా కలిసి బాషాను ఇంటి నుంచి బయటకు లాగి చితకబాదారు. తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో బాషా అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై రాజమంగళ: పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: భర్తకు విషమిచ్చిన కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పిన బంధువులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.