యాప్నగరం

అవ్వ చనిపోయిందని చెప్పి తీసుకెళ్లి.. వివాహితపై రేప్

అవ్వ చనిపోయిందని నమ్మించి తీసుకెళ్లి మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు స్నేహితులు సహకరించారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 1 Jan 2020, 5:23 pm
‘‘మీ అవ్వ చనిపోయింది.. త్వరగా తీసుకురావాలని ఇంట్లో వారు చెప్పారు’’ అంటూ కొందరు బైక్‌పై వచ్చి వివాహితకు చెప్పాడు. ఆమె ఏడ్చుకుంటూ వచ్చి బైక్ ఎక్కింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఆ దుర్మార్గులు ఆమెను తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు..
Samayam Telugu Rape


Also Read: షాక్.. కర్నూలులో కన్న కూతురిని రేప్ చేసిన తండ్రి

ముష్టూరు పంచాయతీకి చెందిన ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని పొలాల వద్ద పొరక ఊసలు సేకరించేందుకు వెళ్లింది. అయితే రెడ్డివారిపల్లె పంచాయతీ, పిట్టావాండ్లపల్లెవడ్డిపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల మహేష్‌ అతడి స్నేహితులు విజయ్, శివ ద్విచక్ర వాహనాల్లో వెళ్లారు. మీ అవ్వ మరణించింది.. ఇంట్లోని నిన్ను తీసుకుని రమ్మన్నారు అంటూ మహేష్ ఆమెకు నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ ఏడుస్తూ అతని మోటార్‌ సైకిల్‌ ఎక్కింది. దీంతో మహేష్‌ బైక్‌ను ఓ కొండవైపు తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం బాధితురాలిని బోయకొండ ఆర్చి వద్ద వదలి పారిపోయారు. దీంతో సోమవారం ఆమె ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలిపింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిమ్మనపల్లె ఎస్‌ఐ సహదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మహేష్‌, అతనికి సహకరించిన విజయ్, శివలను అదుపులోకి తీసుకుని వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడిని నరికిన అన్న

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.