యాప్నగరం

చిత్తూరు చిన్నారి హత్యాచారం కేసు.. ‘సీన్ రీకన్‌స్ట్రక్షన్’ చేసిన పోలీసులు

ఈ కేసులో నిందితుడిపై బలమైన ఆధారాలు సేకరించామని, అన్ని ఆధారాలతో త్వరలోనే న్యాయస్థానంలో ఛార్జీషీటు దాఖలు చేస్తామని డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు.

Samayam Telugu 10 Dec 2019, 11:04 am
Samayam Telugu rafi

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేతనగర్‌ సమీపంలోని కల్యాణ మండపం సమీపంలో గతనెల 8న దారుణహత్యకు గురైన చిన్నారి (6) హత్యకేసులో పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. డీఎస్పీ రవి మనోహరాచారి వర్షిత పోస్టుమార్టం విషయమై స్థానిక జిల్లా ఆస్పత్రి డాక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారి హత్య కేసులో సాధ్యమైనంత వరకు నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించినట్లు చెప్పారు.

Also Read: ‘సమత’ గ్యాంగ్‌రేప్‌ ఘటనలో సంచలన విషయాలు.. 3 నెలలుగా రెక్కీ చేసి

నిందితుడు రఫీని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎల్‌ నివేదిక కూడా వచ్చిందని, దానికి సంబంధించి వైద్యుల సలహాలు తీసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై బలమైన ఆధారాలు సేకరించామన్నారు. అన్ని ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జీషీటు దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో వీలైనంత త్వరగా తీర్పు వచ్చేలా చేస్తామన్నారు.

Also Read: తన భర్తతో అఫైర్ పెట్టుకుందని.. నర్సును చిత్రహింసలు పెట్టిన వైద్యురాలు

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత తల్లిదండ్రులతో కలిసి నవంబర్ నెలలో చేనేతనగర్‌లోని కల్యాణ మండపంలో పెళ్లికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు. ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు. పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు లారీ క్లీనర్‌గా పనిచేసే మదనపల్లె మండలం బసినికొండకు చెందిన రఫీని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

Also Read: సొంత వదినపైనే ముగ్గురు మరుదులు అత్యాచారం.. గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.