యాప్నగరం

CISF: కానిస్టేబుల్ కూతురిపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం..

చాక్లెట్ ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై ఓ హెడ్ కానిస్టేబుల్ అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Samayam Telugu 20 Jan 2020, 6:48 pm
కానిస్టేబుల్ కూతురిపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూతురులా చూసుకోవాల్సిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. ఈ అమానవీయ ఘటన ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలో జరిగింది.
Samayam Telugu child-abuse-m


Also Read: క్రాఫ్ చేయించుకోమన్నందుకు ఉరేసుకున్న టీనేజర్

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) లో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న తమిళనాడుకు చెందిన కందస్వామి పారదీప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టౌన్‌షిప్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే తనతో పాటు విధులు నిర్వహిస్తున్న సహోద్యోగి నాలుగేళ్ల కూతురిపై కన్నేసిన కందస్వామి.. చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన క్వార్టర్స్‌లోనే బాలికపై అఘాయిత్యం చేశాడు.

Read Also: గుంటూరు జిల్లాలో దారుణం.. పదకొండేళ్ల బాలికపై అత్యాచారం..

తనపై జరిగిన దారుణాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో కానిస్టేబుల్ అబయచందపూర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ కందస్వామిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.