యాప్నగరం

చిత్తూరులో ఘోరం.. నీళ్ల కోసం వేటకొడవళ్లతో నరికి..

సాగునీటి కోసం సొంత పెదనాన్నపైనే వేటకొడవలితో దాడి చేశారు తమ్ముడి కుటుంబ సభ్యులు. ఇద్దరికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 25 Oct 2020, 4:00 pm
పొలానికి నీళ్లు పెట్టుకునే విషయమై అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం వేటకొడవళ్ల వరకూ వెళ్లింది. దాయాదినే కత్తులతో నరికేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం నాయునివారిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య పొలానికి సాగునీటి విషయమై గొడవలు జరుగుతున్నాయి. మరోమారు పొలంలో గొడవ జరగడంతో పెదనాన్న, ఆయన కొడుకుపైనే తమ్ముడి కుటుంబ సభ్యులు వేటకొడవళ్లతో దాడికి దిగారు. కొడవళ్లతో నరకడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sickle


Also Read: చిత్తూరులో మహిళా వాలంటీర్ అదృశ్యం.. వైసీపీ నేతపై కిడ్నాప్ కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.