యాప్నగరం

పకోడీలకు డబ్బులడిగినందుకు దారుణం.. రూ.5ల కోసం తుపాకీతో కాల్చేసి..

ఓ ప్లేట్ పకోడీలకు డబ్బులు అడిగినందుకు జరిగిన వివాదం.. కాల్పులకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన సోదరులు ఏకంగా తుపాకీ తెచ్చి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది.

Samayam Telugu 7 Feb 2020, 3:03 pm
పకోడీలు తిన్నందుకు డబ్బులడిగాడని చిరువ్యాపారిపై కాల్పులు జరిపిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదు రూపాయల దగ్గర మొదలైన గొడవ ప్రతీకారానికి దారితీసింది. రోడ్డు పక్కన పకోడీలు అమ్ముకునే వ్యక్తిని.. అతని సోదరుడిని తుపాకీతో అమానుషంగా కాల్చివేశారు. ఈ కాల్పుల ఘటన బిహార్‌లో జరిగింది.
Samayam Telugu gun fire


పకోడీలు తిని డబ్బులడిగినందుకు ఇద్దరు యువకులు వ్యాపారిపై కాల్పులు జరిపిన సంఘటన బక్సర్ జిల్లాలో చోటుచేసుకుంది. గోలు యాదవ్, చున్ను యాదవ్ అనే ఇద్దరు సోదరులు రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న దుకాణంలో పకోడీలు తిన్నారు. అందుకు రూ.5లు చెల్లించే విషయమై వ్యాపారితో వివాదం తలెత్తింది. స్థానికులు స్పందించి ఇద్దరికీ సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also Read: నా బాయ్‌ఫ్రెండ్‌ని సుఖపెట్టు.. కూతురిపై తల్లి దాష్టీకం.. బలవంతంగా గదిలోకి పంపి..

మరుసటి రోజు తుపాకీతో వచ్చిన ఇద్దరు సోదరులు.. పకోడీలకు డబ్బులు అడిగిన వ్యాపారిపై కాల్పులు జరిపారు. అతని కాలిపై కాల్చడంతో బుల్లెట్ దూసుకుపోయింది. కాల్పులు జరపడం చూసి వ్యాపారి సోదరుడు అడ్డుకునేందుకు యత్నించాడు. అతనిపై కూడా కాల్పులు జరిపారు. అతని కాలులో మరో బుల్లెట్ దింపారు.

Read Also: ప్రేమ నగరంలో సెక్స్ దందా.. రష్యా నుంచి అందమైన యువతులను తెచ్చి..

కేవలం ఐదు రూపాయలు చెల్లించే విషయమై జరిగిన చిన్న గొడవ కాల్పులకు దారితీయడం.. ఏకంగా తుపాకీతో కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. అయితే పకోడీల బిల్లు రూ.5ల కంటే బుల్లెట్ల ఖర్చు ఎక్కువవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.