యాప్నగరం

చిత్తూరులో కామపిశాచులు.. పదో తరగతి బాలికను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు కనిపించడం లేదు. మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా ఏపీలో వెలుగుచూసింది.

Samayam Telugu 21 Feb 2020, 10:02 pm
కామపిశాచులు మరోసారి రెచ్చిపోయాయి. పదో తరగతి బాలిక జీవితాన్ని నాశనం చేశాయి. మైనర్ బాలికను బలవంతంగా లాక్కెళ్లి ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏర్పేడు మండలానికి చెందిన పదో తరగతి బాలికపై కన్నేసిన కామాంధులు ఆమెను అడ్డగించి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Samayam Telugu rape2


బహిర్భూమికి వెళ్లి వస్తున్న బాలికను అదే గ్రామానికి చెందిన సాయి, అంకయ్య, వీరాస్వామి అనే ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పశువుల్లా ఆమెపై పడి తమ కామవాంఛ తీర్చుకున్నారు. కామాంధుల లైంగిక దాడితో భీతిల్లిపోయిన బాలిక ఆర్తనాదాలు చేయడంతో సమీపంలోని గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.

Also Read:
లేడీ క్లర్కులను నగ్నంగా నిలబెట్టిన డాక్టర్.. ఆస్పత్రిలో దారుణ ఘటన

బాలికను అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. రేణిగుంట సీఐ అంజు యాదవ్ ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కి చేరుకుని దారుణ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. బాధితురాలిని విచారిస్తున్నట్లు సమాచారం. మైనర్ బాలిక రేప్ విషయం కావడంతో పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.

Read Also: భార్య చెల్లెలిపై కన్నేసి.. న్యూడ్ ఫొటోలు తీసి.. గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.