యాప్నగరం

తమ్ముడి కూతురిపై కన్నేసిన పెదనాన్న.. అనంతపురంలో దారుణం

పదో తరగతి బాలికపై పెదనాన్న వేధింపులకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కొద్దికాలం మౌనంగా భరించిన బాలిక.. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 25 Jan 2020, 7:56 pm
వావీవరసలు మరచిపోయి రెచ్చిపోతున్నారు కామాంధులు. అయినవాళ్లే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు దిగుతున్నారు. అసభ్యంగా తాకుతూ ఇబ్బందికర చేష్టలతో చెలరేగుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా అనంతపురంలో చోటుచేసుకుంది.
Samayam Telugu harrass


కూతురు వరసయ్యే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రబుద్ధుడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని నవోదయ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. బాలికకు వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి కొద్దికాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎవరికి చెప్తే ఏమనుకుంటారోనని మౌనంగా ఇన్నాళ్లూ భరించిన బాలిక.. వేధింపులు ఎక్కువవడంతో తల్లిదండ్రలకు విషయం చెప్పింది.

Also Read: మొగుడ్ని చంపించింది.. ప్రియుడిని బుక్ చేసింది.. కీలాడీ లేడీ ప్లాన్‌కి హైదరాబాద్ పోలీసులు షాక్

కూతురు వరసయ్యే బాలికపై వేధింపులకు పాల్పడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు అతనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచి రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. వైద్య రిపోర్టులు పరిశీలించిన అనంతరం నిందితుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Read Also: మనవరాలిని చంపేసిన తాతయ్య, నానమ్మ.. విజయవాడలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.