యాప్నగరం

PUBG Addiction: పబ్జీ ఆడుకోవడానికి ఫోన్ కొనలేదని బాలుడి ఆత్మహత్య

పబ్జీ ఆడుకోవడానికి సెల్‌ఫోన్ కొనివ్వాలని ఎన్నిసార్లు కోరినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో పదో తరగతి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 7 Aug 2020, 11:34 am
ఇటీవల కాలంలో పబ్జీ గేమ్‌ యువతపై విపరీతమైన ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఆ గేమ్ మత్తులో పడి ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీనేజీలో ఉన్నవారైతే పబ్జీ కోసం ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ కోవలోనే పబ్జీ గేమ్ ఆడుకునేందుకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురైన బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో జరిగింది
Samayam Telugu Image


Also Read: నడిరోడ్డుపై వివాహితకు వేధింపులు.. అడ్డుకున్న భర్త, పోలీసులపై యువకుల దాడి

తిరుపత్తూర్‌ జిల్లా కురిసలాపట్టు సమీప ప్రాంతానికి చెందిన దంపతులకు కుమారుడు(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు ఇంకా తెరవకపోవడంతో అతడి స్నేహితులు సెల్‌ఫోన్లో రోజూ పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. దీంతో ఆ బాలుడు కూడా తనకు ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులకు కోరుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తినడానికి తిండి దొరకడమే కష్టంగా ఉందని, అలాంటి ఫోన్ ఎలా కొనగలమని దంపతులు కొడుక్కి చెప్పారు.

Also Read: పెళ్లి ఇష్టంలేక మహిళా టెక్కీ ఆత్మహత్య... హైదరాబాద్‌లో విషాదం

బుధవారం స్కూల్‌కి వెళ్లి పదో తరగతి పాఠ్య పుస్తకాలను తెచ్చుకున్న బాలుడు తన స్నేహితులను కలుసుకున్నాడు. అక్కడ వారి మధ్య పబ్జీ గేమ్ ప్రస్తావన రావడంతో వెంటనే ఇంటికి వెళ్లి ఫోన్ కొనాలంటూ తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. వారు కుదరదని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: పరువు హత్య.. ప్రేమలో పడిందని కూతురిని కొట్టి చంపేసిన తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.