ఇంజనీరింగ్ కళాశాలల విష సంస్కృతి ‘ర్యాగింగ్’ ఇప్పుడు పాఠశాలల్లోనూ విషబీజాలు నాటుతోంది. ర్యాగింగ్ భూతం బారిన పడి పదో తరగతికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం హైదరాబాద్లోని సరూర్ నగర్లో కలకలం రేపుతోంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మాన్ఘాట్లో ‘నియో రాయల్’ స్కూల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడటంతో.. వేధింపులకు తాళలేక ఓ విద్యార్థి ఉరేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించాడు. గొంతు ప్రాంతంలో నరాలు చిట్లడంతో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన రవికిరణ్ కర్మాన్ ఘాట్లోని నియో రాయల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. కొంత కాలంగా తోటి విద్యార్థులు అతణ్ని ర్యాగింగ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని రావాలని బెదిరిస్తున్నారు. విద్యార్థుల వేధింపులకు భయపడిన రవికిరణ్.. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుంచి పలు దఫాలుగా రూ.6 వేలు తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టారు.
రవికిరణ్ భయాన్ని అలుసుగా చేసుకున్న తోటి విద్యార్థులు అతణ్ని మరింతగా భయపెట్టి రూ.10,000 తీసుకురావాల్సిందిగా హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు.. తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక, ఇంట్లో వాళ్లను మోసం చేయలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉరేసుకొని చనిపోవడానికి యత్నించాడు.
డాడీ ఐ యామ్ సారీ.. మిస్సింగ్ యూ మమ్మీ
ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి రవికిరణ్ అంతుకుముందు సూసైడ్ నోట్ రాసిపెట్టారు. పాఠశాలలతో విద్యార్థులు తనను తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఓ విద్యార్థి తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.6000 వేలు తీసుకున్నట్లు తెలిపాడు. ‘డాడీ ఐ యామ్ సారీ.. వారి వల్లే నేను చనిపోతున్నా.. ఐ యామ్ మిస్సింగ్ యూ మమ్మీ’ అంటూ అతడు లేఖలో రాశాడు. తన కుమారుడు అనుభవించిన వేదనను తలచుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తల్లిదండ్రులు సరైన సమయంలో స్పందించి రవికిరణ్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఎల్బీ నగర్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక రవికిరణ్.. ధైర్యం చేసి స్కూల్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని బంధువులు ధరోపిస్తున్నారు. సోమవారం (జులై 8) ఉదయం పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ విషయం దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని యాజమాన్యాన్ని నిలదీశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవికిరణ్ రాసిపెట్టిన సూసైట్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రవికిరణ్ భయాన్ని అలుసుగా చేసుకున్న తోటి విద్యార్థులు అతణ్ని మరింతగా భయపెట్టి రూ.10,000 తీసుకురావాల్సిందిగా హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు.. తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక, ఇంట్లో వాళ్లను మోసం చేయలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉరేసుకొని చనిపోవడానికి యత్నించాడు.
డాడీ ఐ యామ్ సారీ.. మిస్సింగ్ యూ మమ్మీ
ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి రవికిరణ్ అంతుకుముందు సూసైడ్ నోట్ రాసిపెట్టారు. పాఠశాలలతో విద్యార్థులు తనను తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఓ విద్యార్థి తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.6000 వేలు తీసుకున్నట్లు తెలిపాడు. ‘డాడీ ఐ యామ్ సారీ.. వారి వల్లే నేను చనిపోతున్నా.. ఐ యామ్ మిస్సింగ్ యూ మమ్మీ’ అంటూ అతడు లేఖలో రాశాడు. తన కుమారుడు అనుభవించిన వేదనను తలచుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తల్లిదండ్రులు సరైన సమయంలో స్పందించి రవికిరణ్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఎల్బీ నగర్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక రవికిరణ్.. ధైర్యం చేసి స్కూల్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని బంధువులు ధరోపిస్తున్నారు. సోమవారం (జులై 8) ఉదయం పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ విషయం దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని యాజమాన్యాన్ని నిలదీశారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవికిరణ్ రాసిపెట్టిన సూసైట్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.