స్నేహితురాలిని కలవడానికి వెళ్తే దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయికి మత్తు మందు ఇచ్చి ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హర్యానాలోని కురుక్షేత్రలో సోమవారం (ఫిబ్రవరి 22) చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటన వెనుక బాధితురాలి స్నేహితురాలి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
కురుక్షేత్ర జిల్లా బబైన్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17 ఏళ్లు) 12వ తరగతి చదువుతోంది. కొంత కాలంగా స్కూల్ ముగిసిన తర్వాత ఇంగ్లిష్ స్పీకింగ్ క్లాసులకు హాజరవుతోంది. సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగివస్తోంది. కానీ, సోమవారం సాయంత్రం చీకటి పడుతున్నా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
బాధితురాలి తండ్రి.. స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు చెప్పే టీచర్ను సంప్రదించగా ఆమె ఆ రోజు క్లాస్లకే హాజరు కాలేదని చెప్పాడు. దీంతో ఆయనకు ఆందోళన పెరిగిపోయింది. బంధువుల సాయంతో చుట్టుముట్టు ప్రాంతాల్లో గాలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆ బాలిక బరారా చౌక్ వద్ద ఓ బైక్ మీద కనిపించింది. ఇద్దరు యువకులు ఆమెను బైక్పై కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా కుటుంబసభ్యులు అడ్డగించారు.
బాధితురాలు అపస్మారక స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆమెతో పాటు ఉన్న యువకులను నిలదీస్తుండగా.. ఓ యువకుడు తప్పించుకొని పరారయ్యాడు. మరో యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాలికను వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అఘాయిత్యం జరిగినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మిగిలిన నలుగురు నిందితుల గురించి కూడా వివరాలు చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులందరినీ అదుపులోకి తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కు తరలించారు.
పక్కా ప్రణాళికతో..
అమ్మాయిపై కన్నేసిన నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం అఘాయిత్యానికి పాల్పడినట్లు ఘటన జరిగిన తీరును గమనిస్తే అర్థమవుతోంది. సోమవారం ఎప్పట్లాగే స్కూలుకు వెళ్లిన బాధితురాలు తరగతులు ముగిసిన అనంతరం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలు ఆమెకు తాగడానికి డ్రింక్ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. దీంతో తన కజిన్ అజయ్ (18) ఆమెను ఇంటి దగ్గర దింపుతాడని స్నేహితురాలు చెప్పింది.
అజయ్ ఆమెను బైక్పై ఎక్కించుకొని ఇంటి వద్ద దింపకుండా నేరుగా ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి మరో నలుగురు స్నేహితులు చేరుకున్నారు. వారంతా కలిసి హోటల్ గదిలో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన అభిషేక్ (18) ఆ హోటల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Must Read:
✧ ఏనుగును ఎంత దారుణంగా కొట్టారో చూడండి..
✧ నిద్రలో నడిచే అలవాటు.. అర్ధరాత్రి ఘోరం జరిగిపోయింది!
✧ ఈ కొత్త జంటకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. మీరు అస్సలు షాకవ్వరు
కురుక్షేత్ర జిల్లా బబైన్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17 ఏళ్లు) 12వ తరగతి చదువుతోంది. కొంత కాలంగా స్కూల్ ముగిసిన తర్వాత ఇంగ్లిష్ స్పీకింగ్ క్లాసులకు హాజరవుతోంది. సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగివస్తోంది. కానీ, సోమవారం సాయంత్రం చీకటి పడుతున్నా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
బాధితురాలి తండ్రి.. స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు చెప్పే టీచర్ను సంప్రదించగా ఆమె ఆ రోజు క్లాస్లకే హాజరు కాలేదని చెప్పాడు. దీంతో ఆయనకు ఆందోళన పెరిగిపోయింది. బంధువుల సాయంతో చుట్టుముట్టు ప్రాంతాల్లో గాలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆ బాలిక బరారా చౌక్ వద్ద ఓ బైక్ మీద కనిపించింది. ఇద్దరు యువకులు ఆమెను బైక్పై కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా కుటుంబసభ్యులు అడ్డగించారు.
బాధితురాలు అపస్మారక స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆమెతో పాటు ఉన్న యువకులను నిలదీస్తుండగా.. ఓ యువకుడు తప్పించుకొని పరారయ్యాడు. మరో యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాలికను వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అఘాయిత్యం జరిగినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మిగిలిన నలుగురు నిందితుల గురించి కూడా వివరాలు చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులందరినీ అదుపులోకి తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కు తరలించారు.
పక్కా ప్రణాళికతో..
అమ్మాయిపై కన్నేసిన నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం అఘాయిత్యానికి పాల్పడినట్లు ఘటన జరిగిన తీరును గమనిస్తే అర్థమవుతోంది. సోమవారం ఎప్పట్లాగే స్కూలుకు వెళ్లిన బాధితురాలు తరగతులు ముగిసిన అనంతరం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలు ఆమెకు తాగడానికి డ్రింక్ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. దీంతో తన కజిన్ అజయ్ (18) ఆమెను ఇంటి దగ్గర దింపుతాడని స్నేహితురాలు చెప్పింది.
అజయ్ ఆమెను బైక్పై ఎక్కించుకొని ఇంటి వద్ద దింపకుండా నేరుగా ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి మరో నలుగురు స్నేహితులు చేరుకున్నారు. వారంతా కలిసి హోటల్ గదిలో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన అభిషేక్ (18) ఆ హోటల్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Must Read:
✧ ఏనుగును ఎంత దారుణంగా కొట్టారో చూడండి..
✧ నిద్రలో నడిచే అలవాటు.. అర్ధరాత్రి ఘోరం జరిగిపోయింది!
✧ ఈ కొత్త జంటకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. మీరు అస్సలు షాకవ్వరు