యాప్నగరం

‘పశ్చిమ’లో దారుణం.. స్కూల్‌ నుంచి ఎత్తుకెళ్లి 8ఏళ్ల బాలికపై రేప్

కామవరపుకోట గ్రామంలో స్కూల్‌ మైదానంలో ఆడుకుంటున్న నాలుగో తరగతి బాలికను అంజయ్య అనే వ్యక్తి మాయమాటలతో నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 22 Jan 2020, 7:06 pm
‘దిశ’ చట్టం అమల్లోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఎక్కడో చోట అబలలపై కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ జరిగింది. కామవరపుకోట మండల కేంద్రంలో నాలుగో తరగతి చదువుతున్న బాలికపై అంజయ్య అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. బుధవారం స్కూల్‌ మైదానంలో ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి చెందిన పొట్లూరి అంజయ్య అనే వ్యక్తి కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Samayam Telugu west


Also Read: గ్యాంగ్ రేప్ చేసి నోట్లో బియ్యం కుక్కి.. ప్రాణాలు విడిచిన ఒంగోలు బాధితురాలు

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించిన అంజయ్య అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అంజయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్కూల్‌లో ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న తమ ఆడబిడ్డలకు ఎవరు రక్షణ కల్పిస్తారంటూ నిలదీస్తున్నారు.

Also Read: ఒంటరి మహిళపై రైల్లోనే గ్యాంగ్‌ రేప్.. అసలు విషయం తెలిసి ఏడుస్తున్న రేపిస్టులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.