యాప్నగరం

పోలీస్ స్టేషన్‌లోనే ఉరేసుకున్న కానిస్టేబుల్.. కామారెడ్డిలో విషాదం

పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎవరూ లేని సమయంలో పోలీస్ స్టేషన్‌లోనే ఉరి వేసుకుని తనువు చాలించడం కలకలం రేపుతోంది.

Samayam Telugu 29 Jan 2020, 6:47 pm
పోలీస్ కానిస్టేబుల్ స్టేషన్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలో జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లచ్చా గౌడ్ స్టేషన్‌లోనే తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో పోలీస్ ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Samayam Telugu death-by-hanging-


Also Read: లేడీస్ టాయిలెట్‌లో కెమెరా.. మహిళను సీక్రెట్‌గా షూట్ చేస్తుండగా ..

బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు ఆత్మహత్యకు పాల్పడుతుండడం కలవరపరుస్తోంది. గతంలో సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఓ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read Also: అన్నం, నీళ్లు లేకుండా అదే పని.. యువతికి నరకం చూపిన రాక్షసుడు..

ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఎస్సై స్థాయి అధికారులు సైతం సూసైడ్‌ చేసుకున్న ఘటనలున్నాయి. హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్సైగా పని చేస్తున్న సైదులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుస పోలీసు ఆత్మహత్యలు ఆందోళనకు కలిగిస్తున్నాయి.

Also Read: యువతి శవానికి గర్ల్‌ఫ్రెండ్ బట్టలు, నగలు.. ప్రేమ జంట మాస్టర్ ప్లాన్.. షాకైన పోలీసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.