యాప్నగరం

గుంటూరులో ఏఎస్సై దౌర్జన్యం.! ‘ఆమె’ ఆస్తుల కోసం బెదిరింపులు

పోలీస్ నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. వివాహేతర సంబంధం.. ఆస్తి కోసం బెదిరింపులు వంటి తీవ్ర ఆరోపణలు చేశారు.

Samayam Telugu 7 Oct 2020, 1:09 pm
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆస్తులు కొట్టేసేందుకు ఓ ఎస్సై బెదిరిస్తున్నాడంటూ ఆమె కొడుకులు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. గుంటూరు జిల్లా గురజాల ఏఎస్సైగా పనిచేస్తున్న వెంకట్రావు తమ తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఆస్తులపై కాజేసేందుకు చూస్తున్నాడని ఆరోపించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ap police


స్థానిక పోలీస్ స్టేషన్‌కి పిలిపించి అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా తమ తండ్రి శివయ్య చాలా కాలం నుంచి కనిపించకుండా పోయాడని.. అందులోనూ అతని ప్రమేయంపై అనుమానాలున్నాయని కొడుకులు ఫిర్యాదు చేశారు. తండ్రి మిస్సింగ్ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. ఏఎస్సై వెంకట్రావు నుంచి తమకు ప్రాణహాని ఉందని.. తమకు రక్షణ కల్పించాలంటూ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: రోజూ వచ్చే లారీడ్రైవర్‌తో సహజీవనం.. చివరికి దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.