యాప్నగరం

కరోనా కల్లోలంలోనూ కక్కుర్తి.. అమ్మకానికి కర్ఫ్యూ పాసులు

లాక్‌డౌన్ కారణంగా అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదనుగా ఓ ఖాకీ కక్కుర్తికి పాల్పడ్డాడు. ఎమర్జెన్సీ పాసులని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యాడు.

Samayam Telugu 9 Apr 2020, 10:05 pm
కరోనా కల్లోలంలోనూ కొందరు ఖాకీలు కక్కుర్తికి పాల్పడుతున్నారు. అత్యవసర సేవలు, అందుకోసం అవసరమైన వాహనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సిన పోలీసులు.. ఏకంగా రాష్ట్రాలు దాటిపోయేందుకు ప్రైవేటు వ్యక్తులకు పాసులు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన ఘటన వెలుగుచూసింది. ఏకంగా రాష్ట్రాలు దాటిపోయేందుకు రెండు వాహనాలకు పాసులు ఇచ్చిన విషయం బయటపడడంతో సదరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
Samayam Telugu tempo


లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదనుగా బెంగళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ పోక్రాజ్ జవాన్ అనే వ్యక్తి ఓ హెడ్ కానిస్టేబుల్‌తో ఒప్పందం కుదుర్చుకుని రెండు వాహనాలకు అత్యవసర సేవల కింద కర్ఫ్యూ పాసులు సంపాదించాడు.

Also Read: బిహార్‌లో ప్రేమ, పెళ్లి.. బెంగళూరులో శవమై.. ఖమ్మం యువతి విషాదాంతంలో ట్విస్టులెన్నో..

ఆ పాసులను ఉపమోగించి రెండు టెంపో వాహనాల్లో సుమారు 24 మందిని బెంగళూరు నుంచి రాజస్థాన్ తీసుకెళ్లేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే రెండు వాహనాలకు అనధికారికంగా అనుమతులు మంజూరు చేసిన వ్యవహారం బయటికి పొక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. వెంటనే శాఖాపరమైన విచారణకు ఆదేశించడంతో హెడ్ కానిస్టేబుల్ వీరభద్రప్ప అక్రమంగా పాసులు ఇచ్చినట్లు తేలడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరణ ఇవ్వాలంటూ స్టేషన్ ఎస్సైకి మెమో జారీ చేశారు.

Read Also:
పేయింగ్ గెస్ట్‌లకు ఓనర్ల వేధింపులు.. చివరికేమైందంటే.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.