యాప్నగరం

పోలీస్ బైక్‌ని ఢీకొట్టిన కారు.. హైదరాబాద్‌లో విషాదం

అతివేగంగా వచ్చిన కారు కానిస్టేబుల్ ఉసురు తీసింది. బైక్‌ని ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కిందపడిపోయారు. తీవ్రగాయాలు కావడంతో యశోద ఆసత్రికి తరలించారు.

Samayam Telugu 11 Jul 2020, 9:36 pm
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. షాద్‌నగర్‌కి చెందిన అజయ్ కుమార్(42) ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన శుక్రవారం విధి నిర్వహణలో భాగంగా బ్లూకాట్ పోలీస్ బైక్‌పై వెళ్తుండగా ఉప్పల్‌లో అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
Samayam Telugu ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్ అజయ్
hyderabad cop death


బైక్‌ పైనుంచి అజయ్ కుమార్ కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేడిపల్లి పంచవటి కాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అభిరామ్ రెడ్డి(23) కారు వేగంగా నడుపుతూ పోలీస్ బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన అజయ్‌ కుమార్‌ని పోలీసులు చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.

Also Read: కట్టుతప్పిన భార్య.. కకావికలమైన కుటుంబం.. సాధించిందేంటి?Read Also: విశాఖలో కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఛేజ్..
రోడ్డుపై పడిపోయి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమించి అజయ్ కుమార్ శనివారం సాయంత్రం యశోద ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కారు నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన అభిరామ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కి తరలించారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మరణం తీవ్ర విషాదం నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.