యాప్నగరం

డ్యూటీలో పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్.. తుపాకీతో కాల్చుకుని..

ప్రత్యేక పోలీసు విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. డ్యూటీలో ఉండగానే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Samayam Telugu 21 Jun 2020, 9:49 pm
తుపాకీతో కాల్చుకుని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. హర్యానాలోని జాజర్‌కి చెందిన సందీప్ కుమార్ స్పెషల్ పోలీస్ వింగ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న సందీప్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
shoot


సందీప్ ప్రాణాలు తీసుకునే ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతని మొబైల్ ఫోన్‌లో వీడియోను గుర్తించిన పోలీసులు ఆ దిశగా ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మంచి కొడుకుని.. మంచి భర్తని.. మంచి సోదరుడిని కాలేకపోయాను.. అందుకే మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నట్లు వీడియోలో ఉన్నట్లు సమాచారం.

Also Read: అంగట్లో అమ్మతనం.. పసికందులతో పాపిష్టి వ్యాపారం.. ముఠా అరెస్ట్‌తో షాకింగ్ నిజాలు

అయితే సందీప్ ఆత్మహత్యపై మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబంలో సమస్యల కారణంగానే ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.