యాప్నగరం

అమ్మాయి పుడితే అబ్బాయిని ఎత్తుకెళ్లారు.! గాంధీ ఆస్పత్రిలో కలకలం

కరోనా గొడవ సద్దుమణగక ముందే గాంధీ ఆస్పత్రిలో మరో ఘటన కలకలం రేపింది. పిల్లలను మార్పిడి చేసిన ఘటన వెలుగుచూసింది. అమ్మాయికి బదులు అబ్బాయిని తీసుకెళ్తుండగా చివరి క్షణంలో బయటపడింది.

Samayam Telugu 25 Feb 2020, 5:55 pm
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మరో కలకలం రేగింది. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన నవజాత శిశువులను మార్చేయడం సంచలనంగా మారింది. ఆస్పత్రిలో ఆడపిల్లను ప్రసవించిన ఓ తల్లి ఆ పసికందును వదిలేసి మగబిడ్డను తీసుకెళ్లింది. నవమోసాలు మోసి కన్న కూతురుని అక్కడే వదిలిపెట్టి ఎవరో కన్న మగ పిల్లాడిని దంపతులు తీసుకెళ్లిన దారుణ ఘటన గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
Samayam Telugu baby


చార్మినార్ ప్రాంతానికి చెందిన సఫీయా బేగం పండంటి మగ శిశువు కు జన్మనిచ్చింది. పక్క రూమ్ లో పులమణి అనే మహిళకు ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడ పిల్ల పుట్టడం ఇష్టం లేని వారి బంధువులు బిడ్డ ను తారుమారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు పిల్లలు లేబర్ వార్డ్ లో ఉండగా పులిమణి బంధువులు సోను, సరితా కలసి ఆడ శిశువును అక్కడ పెట్టి.. మగ శిశువు ను తీసుకుని బయటకు వెళ్లారు.

Also Read: ‘అంద’మైన కలలతో నగరానికి.. అనూహ్యంగా సూసైడ్.. ఓ యువతి విషాదాంతం

ఇద్దరూ బయటకు వెళ్లే సమయంలో సెక్యూరిటీ నిలదీయగా పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. అదే సమయంలో శిశువు మారిందని తల్లి సఫీయా బేగం ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మగబిడ్డను తీసుకెళ్లేందుకు యత్నించిన మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మగ శిశువును తల్లి వద్దకు చేర్చారు.

Read Also: కొడుకును లాడ్జి గది బయట నిలబెట్టి.. ప్రియుడితో మహిళ రాసలీలలు.. భర్త వీడియో కాల్ చేయడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.