యాప్నగరం

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు

కుటుంబ కలహాలతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలోని నిజాంపేట శ్రీనివాస కాలనీలో మంగళవారం జరిగింది.

Samayam Telugu 15 Apr 2020, 10:10 am
కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది. బాచుపల్లి పీఎస్ పరిధిలోని నిజాంపేట శ్రీనివాస కాలనీకి చెందిన పి.సురేందర్(42) ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య బిందు(36), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సురేందర్ కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రెండు మూడు రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu dead body


Also Read: లాక్‌డౌన్ పొడిగింపు.. మనస్తాపంతో పూజారి ఆత్మహత్య

మంగళవారం సురేందర్ భార్యతో మళ్లీ గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ సాయంత్రం వేళ బెడ్రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకున్నారు. తల్లిదండ్రులు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఇద్దరు పిల్లలు తలుపు తట్టినా ఫలితం లేకపోయింది. పిల్లల అరుపులు విన్న పైఅంతస్తులో ఉండే సురేందర్ సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల ఆత్మహత్యతో పిల్లలిద్దరూ అనాథలయ్యారని బంధువులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పక్కింటి ఆంటీతో అఫైర్ .. యువకుడిపై మహిళ భర్త హత్యాయత్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.