యాప్నగరం

దంపతులను బలిగొన్న కలహాలు.. ఉరేసుకుని జంట ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది.

Samayam Telugu 3 Sep 2020, 2:12 pm
హైదరాబాద్‌ నగరంలో భార్యభర్తల ఆత్మహత్య విషాదం నింపింది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్, భార్గవి దంపతులు గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్‌కు భార్గవి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వెంకటేశ్‌ విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తుండగా, భార్గవి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది.
Samayam Telugu Image


Also Read: మరో మహిళతో భర్త అఫైర్.. మామిడి తోటలో శవమై కనిపించిన భార్య

అత్తమామలు వేధింపులకు గురిచేస్తుండటంతో భార్గవి భర్తతో కలిసి బయటకు వచ్చేసి కొంతకాలం క్రితం వేరు కాపురం పెట్టింది. ప్రస్తుతం వీరు చిలకలగూడ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, భార్గవి బాత్రూమ్‌ కిటికీకి ఉరేసుకుంది. దీంతో కుటుంబసభ్యులు చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: మద్యం మత్తులో విచక్షణ మరిచిన కొడుకు.. క్రికెట్‌ బ్యాట్‌తో తల్లిపై దాడి

భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దంపతుల మధ్య కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

Also Read: తుళ్లూరు: బావతో అక్రమ సంబంధం, భర్తను చంపేసి ఆత్మహత్యగా నాటకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.