మూడు నెలల పాపకు ఉరి వేశారు. అనంతరం దంపతులు తాము కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం దేవరపల్లిలో మంగళవారం (ఏప్రిల్ 4) వేకువజామున చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లికి చెందిన అశోక్ (30)కు 18 నెలల కిందట ఆలూరు గ్రామానికి చెందిన అంకిత (20)తో పెద్దలు పెళ్లి జరిపించారు. వీరికి 3 నెలల కిందట ఓ పాప జన్మించింది. ఇటీవల అశోక్ చెల్లెలికి పెళ్లి కుదిరింది. సోదరి నిశ్చితార్థం నిమిత్తం అశోక్ తన భార్య, చిన్నారిని తీసుకుని గత గురువారం స్వగ్రామానికి (దేవరపల్లి) వచ్చాడు. సోమవారం సాయంత్రం అశోక్ తన తమ్ముడు రాఘవేంద్రతో కలిసి ఆటోలో కూరగాయలను మార్కెట్కు తీసుకెళ్లాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చారు. వస్తూ వస్తూ తమ వెంట తీసుకొచ్చిన బిర్యానీని అందరూ కలిసి తిన్నారు. ఆ తర్వాత రాఘవేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాసేపటి తర్వాత అశోక్, అంకిత దంపతులు ఉన్న ఇంట్లో నుంచి టీవీ సౌండ్ పెద్దగా వస్తుండటంతో పొరుగింటి వారు నిద్రలేచారు. వారి తలుపులు కొట్టారు. తలుపులు ఎంతకీ తీయకపోవడంతో గొళ్లెం విరగ్గొట్టి తెరిచి చూడగా.. కుటుంబసభ్యులంతా ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు. అంకిత, చిన్నారి అప్పటికే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న అశోక్ను కిందకి దింపుతుండగా, అతడు కూడా ప్రాణాలు విడిచాడు.
టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టిన అశోక్.. తొలుత పాపకు ఉరి వేసిన తర్వాత భార్యకు ఉరి వేసి, తర్వాత తాను ఉరి వేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.
3 నెలల చిన్నారితో పాటు దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో వాళ్లతో మాటా మాటా పెరిగి మనస్తాపానికి గురయ్యారా? ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. బలవన్మరణానికి పాల్పడాలని ముందుగా నిర్ణయించుకునే.. అశోక్ బిర్యానీ తీసుకొచ్చి భార్యతో కలిసి తిని, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చేవెళ్ల ఎస్సై ఆయూబ్ తెలిపారు.
కాసేపటి తర్వాత అశోక్, అంకిత దంపతులు ఉన్న ఇంట్లో నుంచి టీవీ సౌండ్ పెద్దగా వస్తుండటంతో పొరుగింటి వారు నిద్రలేచారు. వారి తలుపులు కొట్టారు. తలుపులు ఎంతకీ తీయకపోవడంతో గొళ్లెం విరగ్గొట్టి తెరిచి చూడగా.. కుటుంబసభ్యులంతా ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు. అంకిత, చిన్నారి అప్పటికే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న అశోక్ను కిందకి దింపుతుండగా, అతడు కూడా ప్రాణాలు విడిచాడు.
టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టిన అశోక్.. తొలుత పాపకు ఉరి వేసిన తర్వాత భార్యకు ఉరి వేసి, తర్వాత తాను ఉరి వేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.
3 నెలల చిన్నారితో పాటు దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో వాళ్లతో మాటా మాటా పెరిగి మనస్తాపానికి గురయ్యారా? ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. బలవన్మరణానికి పాల్పడాలని ముందుగా నిర్ణయించుకునే.. అశోక్ బిర్యానీ తీసుకొచ్చి భార్యతో కలిసి తిని, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చేవెళ్ల ఎస్సై ఆయూబ్ తెలిపారు.