యాప్నగరం

మూగజీవాలనూ వదలని కామాంధులు.. ఆవును రేప్ చేసి కిరాతకంగా చంపేశారు

ఐదో తేదీన కనిపించకుండా పోయిన ఆవు బుధవారం గ్రామ శివారులో విగతజీవిగా కనిపించింది. దాని మర్మాంగాల వద్ద గాయాలుండటంతో అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 9 Jan 2020, 9:08 am
మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిన ఘటన ఇది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమింది. దేశంలో మహిళలపై వరుస దాడులు అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుడు మూగజీవాలను సైతం వదలడం లేదు. కేరళలో ఓ ఆవుపై అత్యాచారానికి పాల్పడిన కామా పిశాచి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu cow-620x400


Also Read: కన్న కూతురిపై రేప్ చేసి.. ఎయిడ్స్ తెప్పించి..! కోర్టు సంచలన తీర్పు

పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌కు పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వినోద్ ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో ఆవు విగతజీవిగా కనిపించింది. దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని ఆరోపించాడు.

Also Read: కట్నపిశాచులు.. హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆవు కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ డాక్టర్లు దానికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ నివేదిక బయటపెట్టలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే నిజానిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఆవుపై అత్యాచారం జరిగిన వార్త పాలక్కాడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Also Read: హైదరాబాద్‌లో మరో యువతి మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబసభ్యులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.