యాప్నగరం

మందు పైత్యం.. వైన్ షాపు ఓనర్‌ని పొడిచేసిన కస్టమర్

వైన్ షాపు వద్ద జరిగిన చిన్న గొడవ కత్తులతో దాడి వరకూ వెళ్లింది. ఆగ్రహం చెందిన కస్టమర్ ఏకంగా వైన్ షాపు ఓనర్‌ని పొడిచేశాడు.

Samayam Telugu 1 Oct 2020, 2:58 pm
మద్యం షాపులో జరిగిన చిన్న గొడవ కత్తిపోట్లకు దారితీసింది. డబ్బులిచ్చానని కస్టమర్.. ఇవ్వలేదంటూ ఓనర్ గొడవపడ్డారు. అది కాస్తా చినికిచినికి పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన కస్టమర్ కత్తితో పొడిచేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ఏరియాలో జరిగింది. మహరల్ గ్రామానికి చెందిన గోవిద్ ప్రేమ్‌ప్రకాష్ వర్మ మద్యం తాగేందుకు గ్రామంలోని రోజ్ వైన్ షాపుకి వెళ్లాడు. దుకాణం మందుబాబులతో కిటకిటలాడుతోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
liquor


తాను రూ.500 ఇచ్చానని.. మద్యం ఇవ్వాలని ప్రేమ్‌ప్రకాష్ ఓనర్‌ని అడిగాడు. తనకు డబ్బులివ్వలేదంటూ ఓనర్ ధరమ్‌పాల్ సింగ్ మద్యం ఇచ్చేందుకు నిరాకరించాడు. అదే విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇచ్చానని కస్టమర్.. ఇవ్వలేదని ఓనర్ గొడవపడ్డారు. ఇద్దరి ఘర్షణ తారస్థాయికి చేరడంతో ఆగ్రహం చెందిన ప్రేమ్‌ప్రకాష్ కత్తితో ధరమ్‌పాల్‌ని పొడిచేశాడు. తీవ్రగాయాలపాలైన వైన్ షాపు ఓనర్‌ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Anantapur: వాలంటీర్ కళ్లలో కారం కొట్టి.. పింఛన్ల డబ్బులు దోపిడీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.