యాప్నగరం

కడుపులో 3కిలోల బంగారం.. కస్టమ్స్ అధికారులకు షాకిచ్చిన స్మగ్లర్లు

చెన్నైలోని పల్లవరం మార్గంలో 10 దుండగులు ఆ కారును ఆపి ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశారు. వారిని ​​చెంగల్పట్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వారి కడుపు కోసి బంగారాన్ని తీసుకున్నారు.

Samayam Telugu 7 Nov 2019, 11:46 am
తమిళ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ చేశారా. అందులో డ్రగ్స్‌ను కొందరి వ్యక్తుల కడుపులో దాచి విదేశాలకు పంపిస్తుంటారు స్మగ్లర్లు. ఈ సినిమానే స్ఫూర్తిగా తీసుకున్నారేమో బంగారం స్మగ్లర్లు. ఇద్దరు మహిళల కడుపులో ఏకంగా 3కిలోల బంగారాన్ని దాచి అక్రమ రవాణా చేయించారు. అయితే ఇక్కడే సినిమాలో కూడా ఊహించని ట్విస్ట్ జరిగింది. కస్టమ్స్ అధికారులు ఆ మహిళలను అరెస్ట్ చేసి బంగారం తీయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా స్మగ్లర్లు ఆ మహిళలను కిడ్నాప్ చేసి కడుపులో బంగారం దోచేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం రాత్రి కలకలం రేపింది.
Samayam Telugu customs officers take women to hospital to retrieve smuggled gold city gang kidnaps
కడుపులో 3కిలోల బంగారం.. కస్టమ్స్ అధికారులకు షాకిచ్చిన స్మగ్లర్లు


Also Read: ట్యూషన్‌కు వచ్చే బాలికను ప్రియుడితో రేప్ చేయించిన టీచర్

మంగళవారం శ్రీలంక నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. వీరిలోశ్రీలంకకు చెందిన ఫాతిమా(32), త్రిష(36) నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ప్రశ్నించారు. తాము గర్భంతో ఉన్నామని వారిద్దరు చెప్పారు. అయితే వారిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేయగా కడుపులో 3కిలోల బంగారం బయటపడింది.

Also Read: చెల్లెలిని కిడ్నాప్ చేసి రేప్.. యువకుడికి 17ఏళ్ల జైలుశిక్ష

దీంతో వారిని అదుపులోకి తీసుకుని బంగారం తీయించేందుకు కారులో ఆస్పత్రికి బయలుదేరారు. చెన్నైలోని పల్లవరం మార్గంలో 10 దుండగులు ఆ కారును ఆపి ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశారు. వారిని చెంగల్పట్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వారి కడుపు కోసి బంగారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆ మహిళలను మీనంబాక్కం సమీపంలోన వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై ఫాతిమా, త్రిష పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరం నడిబొడ్డున స్మగ్లర్లు వేసి ప్లాన్ చూసి పోలీసులు షాకవుతున్నారు. వారి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి 5.6కిలోల బరువైన 48 బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం రూ.2.24కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: భార్యను హనీమూన్‌కి తీసుకెళ్లి.. సెక్స్ వీడియోలు తీయాలంటూ వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.