యాప్నగరం

వికారాబాద్‌లో కలకలం.. అడవిలో జంట ఆత్మహత్య.. కుళ్లిపోయి భయానకంగా మృతదేహాలు

అటవీ ప్రాంతంలో జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతూ భయంకరంగా ఉన్న డెడ్‌బాడీలు కోట్‌పల్లికి చెందిన శివలీల, మహేందర్‌గా గుర్తించారు.

Samayam Telugu 2 May 2020, 6:31 pm
వికారాబాద్ జిల్లాలో జంట మృతదేహాలు కలకలం రేపాయి. జిల్లాలోని అనంతగిరి అడవిలో కుళ్లిపోయిన స్థితిలో జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీర భాగాలు పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడి భయానకంగా ఉన్నాయి. యువకుడి తల మాత్రమే కనిపిస్తుండగా.. యువతి తల పూర్తిగా పాడైంది. పుర్రెపై పొడవైన జుట్టు మాత్రమే కనిపిస్తూ దారుణ స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.
Samayam Telugu డెడ్‌బాడీలను పరిశీలిస్తున్న పోలీసులు


జంట ఆత్మహత్య చేసుకుని నెలరోజులకు పైగా అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. నెలకు పైగా అవడంతో మృతదేహాలు పూర్తిగా పాడైపోయినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలకు సమీపంలో బైక్ లభ్యమైంది. జంట బైక్‌పై అడవిలోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. బైక్ నంబర్ (TS 34 C 1952) ఆధారంగా పోలీసులు ఆరా తీయడంతో మృతుల వివరాలు తెలిశాయి.

Also Read: విశాఖ చిన్నారి జ్ఞ‌ానస కేసులో షాకింగ్ ట్విస్ట్.. తల్లి కుసుమలత ఆత్మహత్య

అడవిలో ఆత్మహత్య చేసుకున్న జంటని జిల్లాలోని కోట్‌పల్లి గ్రామానికి చెందిన శివలీల, మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే జంట ఆత్మహత్యపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? లేక ఎవరైనా ఇక్కడికి తెచ్చి హత్య చేశారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.