యాప్నగరం

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. తండ్రి చేతిలో దారుణహత్య

భర్తతో నాలుగేళ్ల కాపురం చేసిన తర్వాత ప్రియుడితో వెళ్లిపోయింది కవిత. తల్లిదండ్రుల విన్నపంతో పుట్టింటికి రాగా ప్రియుడి అక్కడికి వచ్చి ఆమెను వచ్చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు.

Samayam Telugu 12 Feb 2020, 11:21 am
అక్రమ సంబంధం మోజులో భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న కూతురిని ఓ తండ్రి అతికిరాతకంగా చంపేసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కుటుంబ పరువు తీసిందన్న ఆక్రోశంతో రక్తం పంచుకుని పుట్టిన కూతురి ప్రాణం తీశాడు. బళ్లారి తాలూకా గోడేహళ్‌ గ్రామానికి చెందిన గోపాలరెడ్డిది వ్యవసాయ కుటుంబం. అతడి కూతురు కవిత(22)కు నాలుగేళ్ల క్రితం సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకుడికిచ్చి పెళ్లి చేశాడు.
Samayam Telugu karnataka


Also Read: ఉదయగిరిలో కీచక డాక్టర్... నైట్‌ డ్యూటీలో ఉన్న నర్సును కోరిక తీర్చాలంటూ

కొద్దిరోజులు భర్తతో సవ్యంగానే కాపురం చేసిన కవిత తర్వాత ప్రకాశ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. భర్త కళ్లుగప్పి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం భర్తకు తెలిసి పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. అయితే భర్తతో సవ్యంగా కాపురం చేస్తానని చెప్పిన కవిత కొద్దిరోజుల తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో భర్త, తల్లిదండ్రులు తోరణగల్లు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కవిత ప్రియుడితో సహజీవనం చేస్తోందని తెలిసి అందరూ షాకయ్యారు.

Also Read: మహిళా కానిస్టేబుల్‌కి 100 నగ్న వీడియోలు పంపిన కామాంధుడు.. అతడి వలలో వందలాది మహిళలు

కుటుంబసభ్యులు ఆమెను పద్ధతిగా ఉండాలని కోరడంతో తల్లిదండ్రుల వెంట పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత కవిత వద్దకు వెళ్లిన ప్రకాశ్ తనతో వచ్చేయాలని ఆమెను బలవంతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఆమె అక్రమ సంబంధం విషయం గ్రామంలో తెలిసిపోయింది. దీంతో తన కుటుంబ పరువు పోయిందని ఆవేదన చెందిన గోపాలరెడ్డి సోమవారం రాత్రి కూతురితో గొడవపడి ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గోపాలరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఒంటరిగా ఉన్న మరదలిపై బావ అఘాయిత్యం.. తలుపులు మూసేసి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.