యాప్నగరం

సెల్‌ ఛార్జర్ కోసం గొడవ.. కడప జిల్లాలో డిగ్రీ విద్యార్థి దారుణహత్య

సెల్‌ఫోన్ ఛార్జర్ విషయంలో తలెత్తిన వివాదంపై ఐదుగురు యువకులు డిగ్రీ విద్యార్థి మధుసూదన్‌ను కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన కడప జిల్లా వల్లూరు మండలంలోని లింగాయపల్లె గ్రామంలో జరిగింది.

Samayam Telugu 20 Jul 2020, 1:48 pm
కడప జిల్లాలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఐదుగురు దుండగులు ఓ యువకుడిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటన వల్లూరు మండలంలోని లింగాయపల్లెలో ఆదివారం సాయంత్రం జరిగింది. లింగాయపల్లెకు చెందిన మధుసూదన్‌ (21) కడప ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తండ్రి చాలా ఏళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోగా.. తల్లి ఉపాది కోసం కువైట్ వెళ్లింది.
Samayam Telugu Image


Also Read: కోడలిపై మామ కామం.. రేప్ చేశాడని చెప్పినా పట్టించుకోని భర్త

దీంతో మధుసూదన్ అమ్మమ్మ, పిన్నితో కలిసి లింగాయపల్లెలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం సెల్‌‌‌ఫోన్ ఛార్జర్‌ విషయమై రత్నం, కృష్ణ, ఫణీంద్ర, నాగార్జున, పవన్‌కుమార్‌లతో అతడు ఘర్షణ పడ్డాడు. స్థానికుడైన సమీప బంధువు ఇరువర్గాలను సముదాయించి పంపించేశాడు. అయితే మధుసూదన్ తమపై ఎదురుతిరగడాన్ని తట్టుకోలేక పోయిన ఆ యువకులు మద్యం తాగి అరగంట తర్వాత అక్కడికి చేరుకున్నారు. కత్తులతో మధుసూదన్‌పై విచక్షణా రహితంగా దాడిచేసి ఛాతీపై మూడుచోట్ల పొడిచారు. అనంతరం బైకులపై ఆ ఐదుగురు పరారయ్యారు.

Also Read: కన్నతండ్రి కాదు కీచకుడు.. బెదిరించి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి

తీవ్ర రక్తస్రావం కావడంతో మధుసూదన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మధుసూదన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: మద్యం మత్తులో కన్నతల్లి గొంతు కోసి హత్య.. గుంటూరు జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.