యాప్నగరం

మండపేటలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. స్నేహితుడిని కొట్టి అఘాయిత్యం

స్నేహితుడితో వెళ్తుండగా నలుగురు వ్యక్తులు తనను అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని డిగ్రీ విద్యార్థిని మండపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 4 Mar 2020, 4:32 pm
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu gang rape


Also Read: 15ఏళ్ల బాలికపై 30సార్లు అత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. నిందితుల కోసం పోలీసుల వేట

మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇప్పనపాడు గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు అడ్డగించారు. ఆమె స్నేహితుడిని చితకబాది యువతిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: భర్తతో విడాకులు.. ఇద్దరితో అఫైర్.. తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్య

ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు మండపేట పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిగ్రీ యువతి సామూహిక అత్యాచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: భార్యను చంపిన కేసులో జైలుకి.. ఏడేళ్ల తర్వాత ఆమె ప్రియుడితో కనిపించేసరికి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.