దేశ రాజధానిలో మరో ఘోరం వెలుగుచూసింది. పనిమనిషిపై 25 మంది అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృగాళ్ల దాష్టీకానికి బలైన బాధితురాలు ఆరోగ్యం సహకరించక పది రోజుల పాటు ఫిర్యాదు చేసేందుకు కూడా రాలేకపోయింది. ఫేస్బుక్ ఫ్రెండ్ని నమ్మి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాలుగేళ్ల కిందట ఢిల్లీకి వచ్చిన మహిళ ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవల ఫేస్బుక్లో పరిచయమైన సాగర్(23)తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ దగ్గరైన సాగర్.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని.. రావాలని ఆమెను కోరాడు. సాగర్ మాటలు నమ్మేసిన యువతి అతను చెప్పినట్లే ఈ నెల 3న హొదల్ ఏరియాకి వెళ్లింది.
సమీపంలోని రామ్గఢ్ అటవీ ప్రాంతంలోకి సాగర్ ఆమెను తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతని సోదరుడు, స్నేహితులతో కలసి ఆమెపై నీచానికి ఒడిగట్టాడు. ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మరుసటి రోజు ఆమెను స్క్రాప్ డీలర్ ఆకాష్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదుగురు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. మృగాళ్ల పైశాచికంతో ఆమె ఆరోగ్యం విషమంగా మారడంతో బదర్పూర్ వద్ద పడేసి వెళ్లిపోయారు.
నెమ్మదిగా కోలుకున్న ఆమె పది రోజుల తర్వాత హసన్పూర్ పోలీసులను ఆశ్రయించింది. తనపై 25 మంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు సాగర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
Also Read:
నాలుగేళ్ల కిందట ఢిల్లీకి వచ్చిన మహిళ ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవల ఫేస్బుక్లో పరిచయమైన సాగర్(23)తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుతూ దగ్గరైన సాగర్.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని.. రావాలని ఆమెను కోరాడు. సాగర్ మాటలు నమ్మేసిన యువతి అతను చెప్పినట్లే ఈ నెల 3న హొదల్ ఏరియాకి వెళ్లింది.
సమీపంలోని రామ్గఢ్ అటవీ ప్రాంతంలోకి సాగర్ ఆమెను తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతని సోదరుడు, స్నేహితులతో కలసి ఆమెపై నీచానికి ఒడిగట్టాడు. ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మరుసటి రోజు ఆమెను స్క్రాప్ డీలర్ ఆకాష్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదుగురు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. మృగాళ్ల పైశాచికంతో ఆమె ఆరోగ్యం విషమంగా మారడంతో బదర్పూర్ వద్ద పడేసి వెళ్లిపోయారు.
నెమ్మదిగా కోలుకున్న ఆమె పది రోజుల తర్వాత హసన్పూర్ పోలీసులను ఆశ్రయించింది. తనపై 25 మంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు సాగర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
Also Read: