యాప్నగరం

కాలేజీ పక్కనే శవమై కనిపించిన వైద్య విద్యార్థిని.. ఆ డాక్టర్‌పై అనుమానాలు

ఆగ్రాలోని మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న యువతి మంగళవారం కనిపించకుండా పోయింది. బుధవారం ఉదయం ఆమె కాలేజీ పక్కనే శవమై కనిపించింది.

Samayam Telugu 20 Aug 2020, 1:30 pm
ఉత్తర్‌ప్రదేశ్‌‌‌లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీకి చెందిన యువతి(25) ఆగ్రాలోని ఓ మెడిక‌ల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దువుతోంది. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలిస్తుండగా బుధవారం ఉదయం కాలేజీ సమీపంలోనే విగతజీవిగా కనిపించింది. ఆమె మెడ‌, త‌ల‌పై తీవ్రగాయాలు ఉండటంతో ఎవరో ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Samayam Telugu వైద్య విద్యార్థిని(ఫైల్ ఫోటో)


Also Read: కూతురు, అల్లుడి సాయంతో భర్త హత్య.. నంద్యాలలో దారుణం

జ‌లౌన్ ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తమ కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతితో అతడికి సంబంధం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యువతి మృతదేహం లభించిన ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును త్వరలోనే చేధిస్తామని ఆగ్రా పోలీసులు తెలిపారు.

Also Read: నెల్లూరు: బాలికతో ఎస్ఐ ప్రేమాయణం.. పెళ్లి ఊసెత్తగానే సీన్ రివర్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.