యాప్నగరం

ఇష్టం లేని పెళ్లి చేశారని భర్తను చంపేసింది.. 8ఏళ్ల తర్వాత దొరికిందిలా

కొద్దిరోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిన శకుంతల ప్రియుడిని కలిసి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. తన భర్తను అడ్డు తొలగించుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని అతడికి చెప్పింది. 2011లోనే కమల్ సాయంతో శకుంతల భర్తను చంపేసింది.

Samayam Telugu 10 Oct 2019, 9:32 pm
ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఘటన ఢిల్లీలో 8ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని ఆల్వార్‌కు చెందిన శకుంతల అనే యువతి 2010లో అదే గ్రామానికి చెందిన కమల్‌ సింగ్లా అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కొద్దిరోజులు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే వారి ప్రేమకు అడ్డుచెప్పిన యువతి తల్లిదండ్రులు ఢిల్లీలోని కపషేరా ప్రాంతానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తికిచ్చి 2011లో శకుంతలకు పెళ్లి చేశారు.
Samayam Telugu delhi police solve 8yr old murder mystery woman killed husband with paramours help
ఇష్టం లేని పెళ్లి చేశారని భర్తను చంపేసింది.. 8ఏళ్ల తర్వాత దొరికిందిలా


Also Read: బర్త్‌డే గిఫ్టుకు డబ్బుల్లేవని.. 13 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

కొద్దిరోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిన శకుంతల ప్రియుడిని కలిసి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. తన భర్తను అడ్డు తొలగించుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని అతడికి చెప్పింది. 2011లోనే కమల్ సాయంతో శకుంతల భర్తను చంపేసింది. మృతదేహాన్ని వారిద్దరు మూటగట్టి ఆల్వార్ జిల్లాలోని భివాడి ప్రాంతానికి కారులో తీసుకొచ్చి హైవే పక్కన గుంత తీసి పూడ్చేశారు. తన భర్త కనిపించడం లేదని ఆ వారంలోనే శకుంతల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: 93 మంది మహిళలతో సెక్స్ చేసి దారుణంగా చంపేశాడు

భర్త చనిపోయినప్పటికీ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో శకుంతల అతడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రవి ఎప్పటికైనా వస్తాడని ఎదురుచూస్తున్న అతడి కుటుంబసభ్యులు కోర్టులో పిటిషన్ వేయడంతో కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఈ విషయం తెలుసుకున్న శకుంతల, కమల్... రవి అవశేషాలు మాయం చేసేందుకు ఆల్వార్ వెళ్లారు. కొన్ని ఎముకలను వెలికితీసి ఆల్వార్-ఢిల్లీ హైవేలోని మరో ప్రదేశంలో పూడ్చారు. మరోవైపు పోలీసుల విచారణలో శకుంతల, కమల్ అక్రమ సంబంధం వెలుగులోకి రావడంటతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారంతో రవికి సంబంధించిన 27 ఎముకలను సేకరించి పోస్టుమార్టానికి పంపించారు. ప్రియుడి కోసం భర్త ప్రాణాలు తీసిన శకుంతల దుర్మార్గం 8ఏళ్ల తర్వాత వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు.

Also Read: బాల్య స్నేహితుడి భార్యతోనే అఫైర్.. నిలదీశాడని చంపేశాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.